సందర్భం: ఎన్నికల ప్రచారం
రోజా: అసలు చిరంజీవి ............... ముందర ప్రజారాజ్యం లో .............. చుసుకోమనండి........... చిరంజీవి............................... చిరంజీవి.............................. చిరంజీవి...........................
తెలుగుదేశం కార్య కర్తల్లో ఒక కార్యకర్త ధైర్యం చేసి రోజాకి, మేడం మనం మహా కూటమి గురిచి ప్రస్తుతించడానికి ఎన్నికల ప్రచారం లో ఉన్నాం. కాస్త మన పార్టీ విధి విధానాలు మాట్లాడితే మంచిదేమో, అందులోనూ మనికి ఉన్నది నాలుగే నలుగు రోజుల ప్రచార ఘడియలు. కార్యకర్త మాట పట్టించుకోకుండా తిరిగి చిరంజీవి....... చిరంజీవి........ చిరంజీవి........
దాంతో విసిగిన వేరొక కార్యకర్త చంద్రబాబుకి ఫోన్ చెయ్యగా, చంద్రబాబు ప్రసంగిస్తున్నారు కాస్త లైన్ లో ఉంటె ప్రసంగం అయ్యాక మాట్లాడొచ్చు అందాక ప్రసంగం విను అని చంద్రబాబు అంతరంగికుడొకడు సెలవిచ్చాడు, చేసేది ఎం లేక ఈ రోజా చిరంజీవి దంపుడు కంటే కాస్త చంద్రబాబు ప్రసంగం మేలు అని ప్రసంగం వినగా ఆశ్చర్య పోవడం వాడి ఒంతయ్యింది! అక్కడ కూడా చంద్రబాబు తన ప్రసంగం లో చిరంజీవి...చిరంజీవి.........చిరంజీవి................... ఒక పంక్తిలో కనీసం రెండు సార్లు చిరంజీవి జపం చెయ్యడం సహించలేక "తెలుగు దేశమా .... దాని అయ్య దేశమా.......... అనుకుంటూ జై చిరంజీవ అని ఎన్నికల ప్రచారం నుంచి పరుగు లగాయించాడు...
సందర్భం: కులం పేరుతో ఓట్ల ప్రచారం సాగిస్తున్నందుకు టెక్కలి పోలీసు స్టేషన్ లో అరెస్టు అయ్యిన సినీ నటుడు రాజశేఖర్ ఆ పై బెయిల్ మంజూరుతో మీడియా తో
విలేకరి: రాజశేఖర్ గారు మీరు మీ భార్య ఇప్పటి వరకు చాల నీతి నియమాలు పాటిస్తామని తెగ టముకు వేసారు, మేమిద్దరం తప్ప ఆంధ్ర రాష్ట్రం లో నీతి మంతులే లేరు అనే వారు అలాంటిది ఏ సందర్బాలలో మీరు ప్రలోభ చెంది కులం పేరున ఓట్లు అడుగుతున్నారు అని అడగగా..
రాజశేఖర్: ఇందుకు మా ఆవిడా జబాబు చెప్తాడు....వినండి.......ఓ జీవిత! వీడు అదేం చెబుతున్నాడు అడుగు, సారీ అదేం అడుగుతున్నాడు నువ్వు చెప్పు...
జీవిత: 'సినిమాల్లో సి.ఏం గా ' మోజు తీర్చుకోండి. ముప్పై ఏళ్ళ సినీ పరిశ్రమలో సంపాధించినదాని కంటే ఎక్కువ ఆదాయాన్ని ప్రజారాజ్యం మూడు నెలల్లో సంపాదించింది. సి.ఎం అవ్వడమనే కల ఇప్పటిలో నెరవేరదు......
దాంతో చిరాకు దోబ్బిన విలేకర్లు, జీవిత గారు మేం అడిగింది ఏంటి మీరు చెప్పింది ఏంటి. మాకు టైం లేక మీవద్ద చిరంజీవిగారిని ప్రచారం చెయ్యమని వచ్చామనుకున్నరా? అని రుస రుస లాడుతూ చిత్తగించారు.
కొస మెరుపు: ప్రజలు ఎల్లపుడూ కొత్త ధనాన్ని మార్పును కచ్చితంగా కోరుకుంటారు అనేది మీడియా ఎరిగిన నగ్న సత్యము. 60 ఏళ్ల అనుభవమున్న కాంగ్రెస్ కి, 27 ఏళ్ల వయసున్న తెలుగుదేశానికి ఎందుకు అర్ధం కావటం లేదో ఇటు మీడియా కి అటు ఓటరికి అంతు చిక్కని రహస్యం. ఎన్నో శతాబ్దాలుగా ప్రవహిస్తున్న కృష్ణ గోదావరి నదీ తీరానికి రోజూ పోయి ధ్యాన సంస్కారాలు అర్పించే వాళ్ళ కంటే పుష్కరినికే ప్రాముఖ్యత ఇచే వారెందరో అనేది ఎందుకనో, రాజకీయం ఒక వ్యాపారం గా చేసి నడిపించిన అటు కాంగ్రెస్ కి గాని, ఇటు తెలుగుదేశం కి గాని అర్ధమవ్వడానికి ఎన్ని పుష్కరినిలు పడుతుందో వేచి చూడాలి.
Friday, April 10, 2009
Subscribe to:
Post Comments (Atom)

0 comments:
Post a Comment